ఎబిఎన్ ఆంధ్రజ్యోతి : ఇది ఒక తెలుగు టెలివిజన్ వార్తా చానెల్. ఆంధ్ర బ్రాడ్కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ అక్టోబర్ 15, 2009 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనికి "ఆంధ్రజ్యోతి" దినపత్రిక మాతృసంస్థ. ఈ ఛానెల్కు వేమూరి రాధాకృష్ణ కార్యనిర్వాహక అధికారి. ఈ చానెల్ పొందుటకు సాంకేతిక వివరాలు ఈ క్రింద పేర్కొనబడినాయి.
ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330 మరియు polarization - vertical
ఆంధ్రజ్యోతి
ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ పక్షాన1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారధ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330 మరియు polarization - vertical
ఆంధ్రజ్యోతి
ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ పక్షాన1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారధ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
1960-2000
మొదట నార్ల తో విద్వాన్ విశ్వం, నండూరి రామమోహనరావు సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు ,తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ . 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి వారు సంపాదకత్వం స్వీకరించాడు.నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత ఐ.వెంకట్రావు సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడినది.
2002 అక్టోబర్ 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేసిన వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ గా , కె.రామచంద్రమూర్తి సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతోఒకేసారి తిరిగి ప్రారంభించబడినది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించబడింది. 2008నుండి కె.శ్రీనివాస్ సంపాదకుడిగా వున్నాడు. వేమన వసంత లక్ష్మి, నవ్య అనుబంధం మరియు ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా,జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురంధరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా వున్నారు.
భాష
ఆంధ్రజ్యోతి శైలి, అన్న ప్రచురణ ఈ పత్రిక యాజమాన్యం ప్రచురించింది.
శీర్షికలు, విశిష్టతలు
వారం | విశిష్టత |
---|---|
ప్రతిరోజు | నవ్య, |
ఆదివారం | ఆదివారం అనుబంధం |
సోమవారం | వివిధ సాహిత్య వేదిక |
మంగళ వారం | దిక్చూచి (విద్య,ఉద్యోగావకాశాల ప్రత్యేకం) |
బుధవారం (?) | సకల |
గురువారం(?) | చింతన |
శుక్ర వారం(?) | వైద్యం |
శనివారం (?) | సంస్కృతి |
ప్రముఖ కాలమిస్టులు[మార్చు]
శీర్షిక | కాలమిస్టు | ప్రచురణ వారం, విషయాలు |
---|---|---|
సందర్భం | కె. శ్రీనివాస్ | వార్తావిశ్లేషణ |
దీప శిఖ | రాజ్ దీప్ సర్దేశాయ్ | శుక్రవారం, వార్తావిశ్లేషణ |
పత్రహరితం | మేనకా గాంధీ | జీవకారుణ్యం |
సమాంతరం | సుధీంధ్ర కులకర్ణి | |
భరత వాక్యం | భరత్ ఝన్ ఝన్ వాలా | వార్తా విశ్లేషణ |
గతానుగతం | రామచంద్ర గుహ | చారిత్రాత్మక విశ్లేషణ |
గమనం | తెలకపల్లి రవి | వార్తా విశ్లేషణ |
ఇండియాగేట్ | ఎ కృష్ణారావు | జాతీయ వార్తా విశ్లేషణ |
కొత్త పలుకు] | వేమూరి రాధాకృష్ణ |
గతంలో ప్రాణహిత శీర్షికనఅల్లం నారాయణ తెలంగాణ వాదం విశ్లేషించారు.
ఆన్ లైన్ రూపాలు
ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
- హెచ్టిఎమ్ఎల్ పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి అందుబాటులో వున్నది. మొదట్లో స్వంత ఖతి "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్ కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు
- పిడీయఫ్
ఈ పిడీయఫ్ ఆన్ లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. గత పది రోజుల పేపరు మాత్రమే అందుబాటులో వుంటుంది. - 2007 నుండి ముఖ్య వ్యాసకర్తల వ్యాసాలుఇంటర్నెట్ లో అందుబాటులో వున్నాయి.
విమర్శలు
వైయస్స్ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేఖ పత్రికగా పేరు పొందింది.
0 comments:
Post a Comment