Thursday, June 19, 2014

రచన

రచన (మాస పత్రిక)



px300
రచన ఒక తెలుగు మాసపత్రిక. తెలుగులో సాహిత్యంలో విలువలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఉత్తమ సాహిత్యాన్ని అందరికీ అందించాలన్న ఆశయంతో స్థాపించబడిన పత్రిక 'రచన'. దీని వ్యవస్థాపకులు మరియు ప్రధాన సంపాదకులు శ్రీ వై.వి.యస్.ఆర్.యస్. తల్పశాయి గారు.
కథలు, కథానికలు, కార్టూన్లు, వివిధ శీర్షికలు 'రచన'లో కోకొల్లలు. సాహితీ విలవలు కలిగిన కథలు మాత్రమే ప్రచురించటం 'రచన' తాలూకు విశిష్టత. తతిమ్మా పత్రికల్లో కనబడే సినిమా కబుర్లు, గాసిప్ కబుర్లు, వెకిలి కార్టూన్లు 'రచన'లో మచ్చుకు కూడా కనబడవు. సందర్భాన్నిబట్టి చలంశ్రీశ్రీకా.రా.ముళ్ళపూడి వంటి రచయితల రచనలను గురించి 'రచన' ప్రత్యేక శీర్షికలు వెలువరిస్తుంది.
ఎన్నారై రచయితలు 'రచన'లోని మరొక ప్రత్యేకత. చాలా పత్రికలు ఆంధ్రరాష్ట్రాన్ని దాటి తతిమ్మా దేశాలకు ముఖ్యంగా అమెరికా దేశానికి వాయుమార్గాన తమ సంచికలు చేరవేసినా, రచన ఎనారైలలో ప్రాముఖ్యత సాధించినట్లుగా అవేవీ ప్రాముఖ్యత సాధించలేకపోయాయి. రచనలో వివిధ శీర్షికలు, కథలు మున్నగువాటికి ఎన్నారైలు ఉత్సాహంగా తోడ్పడటం కద్దు.

'రచన' మైలురాళ్ళు

ఇది హైదరాబాదు నుండి వెలువడే మాసపత్రికకథలకి ప్రాధాన్యత. ఇది అంతర్జాలంలో దొరకదు. కానీ ప్రతి సంచికలోనుంచి కొన్ని పుటలను PDF రూపంలో ఈ పత్రిక official websites లో ఉంచుతారు. పూర్తిగా రచయితలే నిర్వహించే ఈ పత్రికను ప్రవాసాంధ్రులు ఎక్కువగా చదువుతారు. కథా సాహిత్యాన్ని ప్రోత్సహించే సాహితీ వైద్యం, కథాపీఠం, కథా ప్రహేళిక లాంటి శీర్షికలు ఈ పత్రికలో ఉన్నాయి. వీటిలో వసుంధర నిర్వహించే సాహితీ వైద్యం శీర్షిక కథా రచయితలు కా.గో.రే. ఔత్సాహికులకు ఉపయోగకరంగా ఉంటుంది.

'రచన' శీర్షికలు

  • సాహితీ వైద్యం
  • కథా పీఠం
  • అమెరికాకమ కబుర్లు

చిరునామా

1-9-286/2/P, విద్యానగర్ (రాంనగర్ గుండు దగ్గర), హైదరాబాద్ - 500 044

మిసిమి

మిసిమి (English : Misimi) ఒక తెలుగు మాస పత్రిక. మేలైన సాహిత్య సంస్కృతీ పరమైన వ్యాసపరంపరలు ఆలోచింపజేసే కవితలను, కన్నులకు ఇంపైన చిత్ర - వర్ణ చిత్రాలను, రసానందాన్ని అందించే అరుదైన సంగీత, సాహిత్య పరిచయాలను, స్ఫూర్తి ప్రదాతలైన వ్యక్తుల జీవన విధానాన్ని వారి మాటలోనే తెలియజేస్తూ ప్రచురించే పత్రిక.

చరిత్ర

రవీద్రనాథ్ ఆలపాటి మిసిమి యొక్క సంస్థపక సంపాదకులు. ఆలపాటి బోపన్న గత ఇరవై సంవత్సరాల నుండి ప్రచురణకర్తగా ఉన్నారు.

కార్య వర్గం

ప్రధాన సంపాదకులు-చెనూరి ఆంజనెయ రెడ్ది.,
సంపాదకులు-అన్నపరెడ్ది వెంకటెస్వర రెడ్ది.,
సహాయ సంపాదకులు-లక్ష్మి రెడ్ది, ఈమని నాగి రెడ్ది,అబ్బురి గొపాల క్రిష్న,జయధీరీ తిరుమల రావు,కుర్రా జితెంధ్ర బాబు


బొమ్మరిల్లు

బొమ్మరిల్లు పిల్లల మాసపత్రిక, ప్రముఖ సినీ నిర్మాతా, దర్శకుడూ అయిన, శ్రీ విజయ బాపినీడు 1971లో స్థాపించారు. దాదాపు, చందమామ వరవడిలొనే కథలు ధరావాహికలు వచ్చేవి కాని భాష, కథా కథనం, కథల ఎంపిక చాలా వేరుగా ఉండేది. ఇందులో మొట్టమొదటి ధారావాహిక 'మృత్యులోయ'. బేతాళ కథలలాగున 'కరాళ కథలు' అని ఒక ధారావాహిక కూడా ప్రవేశపెట్టారు. పత్రికతో బాటు ఒక అనుబంధం కూడా ఇచ్చే పద్దతి ఈ పత్రికే మొదలు పెట్టింది. కొంతకాలం ఒక రిబ్బనులాంటి వెడల్పుగా చాలా బారుగా ఉన్న ఒక ప్రతిని ఇచ్చేవారు. తరువాత, ఒక చిన్న పుస్తకం ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ చిన్న పుస్తకంలో ఓ కథ బొమ్మలతో వేసేవారు. శ్రీమతి గుత్తా విజయలక్ష్మి గారు 'కుందేలు కథలు' అనేకం (ఆంగ్ల కథలకు స్వేఛ్ఛానువాదం) ఈ చిన్న పుస్తకానుబంధం కోసం వ్రాసారు. చందమామకు దీటయిన పోటీనిచ్చింది ఈ పత్రిక.

బాలమిత్ర

బాలమిత్ర (Balamitra) తెలుగు బాలల సచిత్ర మాసపత్రిక. ఇది 1940లో మద్రాసు నుండి ప్రారంబించబడినది. చందమామ వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని వ్యవస్థాపక సంపాదకుడు బి.వి.రాధాకృష్ణ మరియు సహాయ సంపాదకుడు బి.ఆర్.వరదరాజులు. ఇది స్వర్ణోత్సవం జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం తెలుగు మరియు కన్నడం భాషలలో ముద్రించబడుతున్నది.
ప్రస్తుతం ఈ పత్రికలో ఎన్నో నీతిని బోధించే కథలు, ఆసక్తికరమైన విషయాలతో పాటు శ్రీ గురువాయూరప్ప వైభవం, రాజగురువు రహస్యం, గోల్డెన్ గొరిల్లా ధారావాహికలుగా అందిస్తున్నారు. ప్రతి నెల ఒక మినీ నవలను కూడా ఇస్తున్నారు.

బాలభారతం(పత్రిక)

బాలభారతం(పత్రిక)

వికీపీడియా నుండి

బాలభారతం తెలుగు పిల్లల మాసపత్రిక మొదటి సంచిక ముఖపత్రం,జూన్ 2013
రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లల కోసం వెలువడుతున్న మాసపత్రిక బాలభారతం 

ప్రారంభం-ప్రస్థానం

జూన్ 2013 లో తొలిసంచిక విడుదలైంది.

శీర్షికలు-అంశాలు

ఈ పత్రికలో ప్రధానంగా విజ్ఞానం, వినోదం, కళలు, సైన్సు, చరిత్ర, జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలు మొదలైన అంశాలు ఉంటాయి.


బాల (పత్రిక)

తెలుగులో పిల్లల పత్రికలు రావడం 1940 లలో ప్రారంభమైన "బాల" తో మొదలయిందని చెప్పవచ్చు. రేడియో అన్నయ్యగా పిలవబడే న్యాయపతి రాఘవరావు ఈ పత్రిక వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. వీరు 1945సంవత్సరంలో దీనిని మొదలుపెట్టారు.

ఉదయం (పత్రిక)

ఉదయం (పత్రిక)

వికీపీడియా నుండి
ఉదయం దినపత్రిక 1984 సంవత్సరంలో ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు ప్రారంభించారు.
ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్. రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారు. ఇదిహైదరాబాదు మరియు విజయవాడ నుండి ప్రచురించబడేది. ప్రసాద్ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్.వై.పతంజలి పత్రికను నిర్వహించారు.
1991లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు. గజ్జెల మల్లారెడ్డిపొత్తూరి వెంకటేశ్వరరావు, తరువాత కె.రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు.
కొన్ని ఆర్ధిక ఇబ్బందులు మరియు కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడినది.

ప్రత్యేకతలు[మార్చు]

  • అప్పటికి అత్యధికంగా అనగా రెండు లక్షల కాపీలతో పత్రిక ప్రారంభమైనది.
  • ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు' చాలా ప్రాచుర్యం పొందాయి.
  • హైదరాబాదు నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్ ప్రచురించడం మొదలుపెట్టినది.
  • విద్యార్ధుల కోసం వెలువరించిన అనుబంధం "దిక్సూచి" చాలా ప్రసిద్ధమైనది.

ఆంధ్రపత్రిక

వికీపీడియా నుండి

ఆంధ్రపత్రిక
Andhrapatrika1947-8-15.jpg
రకముప్రతి దినం దిన పత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం
సంపాదకులుకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
స్థాపన1908-09-09(వారపత్రిక), 1914-04-01 (దినపత్రిక)
నిర్వహణ ఆగిపోయిన1991
వెలభారతదేశం రూపాయలు:
సోమ వారం-శని వారం
రూ. ఆది వారం
ప్రధాన కేంద్రముముంబై(వారపత్రిక), చెన్నై(దినపత్రిక)
ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.
1914 సంవత్సరంలో పత్రికను మద్రాసు కు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.
నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్ ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు భారతి కి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే హైదరాబాదు మరియువిజయవాడ లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.

http://www.http://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక


అరుణతార

ఈ నెల పత్రిక పరిచయం “అరుణతార”

ఒక సాహిత్య పత్రికగా 275 సంచికలు వెలువడడం మాటలు కాదు. అందులోనూ విప్లవ స్ఫూర్తి నిబద్దతలతో వెలువడుతున్న అరుదైన సాహితీ మాస పత్రిక “అరుణతార”. ఈ మాసపు పత్రికగా అలోచనను పంచే, పెంచే “అరుణతార” పత్రికను పరిచయం చేసుకుందాం. విప్లవ రచయితల సంఘం (విరసం) అధికార పత్రిక “అరుణతార” తాజాగా వెలువరించిన 275వ సంచిక మార్చి – మే 2009 తేదీతో ప్రత్యేక సంచికగా వెలువడింది. మహా రచయిత పతంజలి మీక కొన్ని ప్రత్యేక వ్యాసాలతోపాటు ‘మహిళాతేజం’ ప్రత్యేక శీర్షికతో మరికొన్ని పరిచయ, సంస్మరణ వ్యాసాలున్నాయి. అసలు పుస్తక సమీక్ష అంటే అర్థం మారిపోయిన సందర్భంలో ప్రొఫెసర్ ఆర్. ఎస్. రావు ప్రత్యేక ఆర్థిక మండలాల మీద రాసిన వ్యాసం సమగ్ర పుస్తక సమీక్ష ఎలా వుండాలో చెప్పేదిలా వుంది.
ఇవికాక ప్రతి సంచికలోనూ కథలు, కవిత్వం, పుస్తక పరిచయాలు, వ్యాసాలు తప్పకుండా వుంటాయి. అదికాక ఇటీవల పాణి ‘గుమ్మెటమోత’ సీరియల్ ప్రారంభించారు. సీరియస్ గా సాహిత్యాన్ని చదివే ప్రతి పాఠకుడు తప్పక తెప్పించుకోవాల్సిన పత్రిక “అరుణతార”. ఎందుకు తెప్పించుకోవాలంటే ఈ పత్రిక విడిగా మార్కెట్లో, పత్రికల స్టాల్లో దొరకదు కనక. కేవలం 100 రూపాయల సంవత్సర చందా కట్టి ప్రతి సంచికనూ ఇంటికే తెప్పించుకునే సదుపాయముంది కనుక, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
పైగా బ్లాగులు చదివే మిత్రులందరికీ విన్నవించుకునేదేమంటే, ప్రత్యామ్నాయ పత్రికలకు చందా కట్టడం వాటికి ప్రాణం పోయడమే. మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు రకరకాల రూపాలలో ఆర్థిక వనరులు సమకూరుతాయి. విరాళాలు, ప్రకటనలు, సంవత్సర చందాలు, ఇంకా పాట్రన్ లు వాటికి వుంటారు. కానీ ప్రత్యామ్నాయ పత్రికలు బతికేది కేవలం పాఠకులు చందా కట్టడం వలన మాత్రమే.  మరింత మంది మిత్రులచేత చందా కట్టించడం వల్ల మాత్రమే.
“అరుణతార”కు చందా పంపవలసిన చిరునామా: ఎస్. రవికుమార్, 5-1307, దొరసానిపల్లె రోడ్, ప్రొద్దుటూరు, కడప జిల్లా – 516360. మొబైల్ నెంబరు: 9866021257
http://chaduvu.wordpress.com/2009/09/01/mag03/