Thursday, June 19, 2014

ఆంధ్రపత్రిక

వికీపీడియా నుండి

ఆంధ్రపత్రిక
Andhrapatrika1947-8-15.jpg
రకముప్రతి దినం దిన పత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం
సంపాదకులుకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
స్థాపన1908-09-09(వారపత్రిక), 1914-04-01 (దినపత్రిక)
నిర్వహణ ఆగిపోయిన1991
వెలభారతదేశం రూపాయలు:
సోమ వారం-శని వారం
రూ. ఆది వారం
ప్రధాన కేంద్రముముంబై(వారపత్రిక), చెన్నై(దినపత్రిక)
ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.
1914 సంవత్సరంలో పత్రికను మద్రాసు కు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.
నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్ ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు భారతి కి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే హైదరాబాదు మరియువిజయవాడ లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.

http://www.http://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక


0 comments:

Post a Comment